ఆకాశం లాంటి సత్యం

అవధూత గీత ఆమూలాగ్రం ఒక జీవితానంద ప్రకటన. సంతోషం కానిదేదీ తన అనుభవంలోకి రాని మనిషి మాత్రమే చెప్పగల కవిత. ఈశావాస్య ఉపనిషత్తు 'ఈశావాస్య మిదం సర్వం 'అంది. అంటే ఈ ప్రపంచంలో ఈశ్వరుడు నెలకొనని తావంటూ లేదని చెప్పడం. అవధూతగీత ఆ ఈశ్వరుణ్ణి ఆనందమయుడిగా, అమృతమయుడిగా అనుభవానికి తెచ్చుకుంది. కాబట్టే 'జ్ఞానామృతం, సమరసం, గగనోపమోహం' అని పరమసంతోషంతో ప్రకటిస్తూ ఉన్నది.