ఉపాధ్యాయుడు అన్నిటికన్నా మించి ఒక presence. అతడు తరగతి గదిలో అడుగుపెట్టగానే ఒక సువాసన ఆ గదిలో వీచినట్టుగా ఉండాలి. అతడు నోరుతెరవకముందే అతడి చూపులే పిల్లల్తో మాట్లాడటం మొదలుపెట్టాలి. అతడు చెప్పే పాఠంలోని విషయంకాదు పిల్లల్ని కట్టిపడేసేది, అసలు అతడు ఏం మాట్లాడినా పిల్లలు మంత్రముగ్ధులై పోగలగాలి.
వజ్రంలాంటి కథకుడు
కథకుడిగా గంగాధర్కి ఈ మూడు సామర్థ్యాలూ ఉన్నాయని ఈ కథలు ఋజువు చేస్తున్నాయి. కాబట్టి ఇతడు మరిన్ని కథలూ, నవలలూ రాయాలని కోరుకోకుండా ఎలా ఉండగలను?
కవీ, కథకుడూ, చిత్రకారుడూ
రావిశాస్త్రిగారి కథల్లోనూ, నవలల్లోనూ దుమ్ముతో కూడుకున్న జీవితమే ప్రధానంగా కనబడుతుంది. కాని ఆ ధూసరమయ వాస్తవాన్ని చిత్రించడానికి ముందో, లేదా, ఆ చిత్రణమధ్యనో ఆయన ఒక కాంతిమయ దృశ్యశకలాన్ని ఇమిడ్చిపెడతాడు. ఆ మొత్తం కథకి ఆ ప్రకాశవంతమైన పదచిత్రమే ప్రాణంలాంటిదని చెప్పవచ్చు. స్వయంగా కవి, నిరుపమానమైన చిత్రకారుడు మాత్రమే అటువంటి ఇంద్రజాలాన్ని మనమీద ప్రయోగించగలడు.
