లబ్ధ ప్రతిష్టులెందరో ఆ సంస్థ పురస్కారం తమకి లభించడం తమకి గౌరవంగా భావిస్తూ ఉన్నారు కూడా. అయితే మొదటిసారిగా ఈ సంస్థ ఒక గిరిజన రచయితకు ఈ పురస్కారం ప్రకటించి తన గౌరవాన్ని ఇనుమడించుకుందని భావిస్తున్నాను
భారతీయ రచయిత
మనం కూడా ప్రపంచ సాహిత్యం చదువుతాం. కాని రాజారావులాంటి వాళ్ల పఠనానుభవం కేవలం ఒక పాఠకుడి అనుభవం కాదు, అది ఒక తీర్థయాత్రీకుడి అనుభవం. ఒక ఆధ్యాత్మిక సాధకుడి అనుభవం.
ప్రతిభావంతమైన రచన
కాని ఒక నవల విజ్ఞానసర్వస్వం కాదు. అందులో పాత్రల మధ్య సంబంధాలు రసమయంగా చిత్రించబడ్డప్పుడే పాఠకుడి హృదయాన్ని తట్టగలుగుతుంది. ఈ రచనలో అటువంటి రసమయఘట్టాలు అడుగడుగునా ఉన్నాయి. అందువల్లనే ఒకసారి చేతుల్లోకి తీసుకున్నాక, ఈ రచనని పాఠకుడు పక్కన పెట్టడం కష్టం.
