దైనందిన జీవితంలో హెచ్చుతగ్గుల్లేని సమాజం ఒనగూడాలంటే భాషలోనూ, జ్ఞానంలోనూ కూడా హెచ్చుతగ్గులుండకూడదని వచనకవులు మనసారా నమ్మారు. కాబట్టి వారు అప్పటికి ప్రచలితంగా ఉన్న ఒక్క ఛందోనియమాన్ని కూడా పాటించవలసిన పనిలేని ఒక నవ్యవాహికగా వచనాన్ని తీర్చిదిద్దుకున్నారు.
