తరిగొండ ప్రసన్న నరసింహస్వామి గుడి ముంగిట నిల్చుని మరొకసారి వెంగమాంబకు మనసారా నమస్సులర్పించాను. కొందరి దృష్టి చరిత్ర మీద ఉంటుంది, చరిత్ర నిర్మించడం మీద ఉంటుంది. మరికొందరి దృష్టి చరిత మీద ఉంటుంది. తమని తాము సంస్కరించుకునే ప్రయత్నంలో తమకు తెలియకుండానే వారు కొత్త చరిత్ర సృష్టిస్తారు. వెంగమాంబ రెండవతరహాకి చెందిన మనిషి, కవి.