ఈస్తటిక్ స్పేస్ కథలో కథకుడు ఒక మాటన్నాడు. ''మనుషులు స్పేస్ లో స్టేషన్లు నిర్మించి నివాసం ఉంటున్నారు గాని, తమలో దాగి వున్న ఈస్తటిక్ స్పేస్ విలువని గుర్తించడం లేదు'' అని. అందుకని మనకోసం కథకుడు నిర్మించిన ఒక ఈస్తటిక్ స్పేస్ స్టేషన్ ఈ కథాసంపుటం.
ముప్పై ఏళ్ళల్లో
తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించి ముఫ్పై ఏళ్ళయిన సందర్భంగా, ముఫ్ఫైఏళ్ళ (1985-2015) తెలుగు సాహిత్యం మీద ఒక గోష్టి ఏర్పాటు చేసారు. అందులో కీలకప్రసంగం చేయవలసిందిగా మృణాళిని నన్నడిగారు.