ఆ వ్యాసాల్లో రవీంద్రుడు భారతీయ సహృదయ పరంపరకు ఇరవయ్యవ శతాబ్ది వారసుడిగా కనిపిస్తాడు. ఉప్పెనలాగా విరుచుకుపడ్డ పాశ్చాత్య సభ్యతను అవగాహనకు తెచ్చుకుంటూ ఆ వెలుగులో మన సాహిత్యాన్నీ, మన సాహిత్యం వెలుగులో ఆధునిక జీవితాన్నీ, ఆధునిక సందర్భంలో సాహిత్యకారుల కర్తవ్యాన్నీ తెలుసుకుంటూ చేసిన రచనలవి.