కరదీపిక

భారతరరాజ్యాంగ రూపకర్తలు గిరిజన ప్రాంతాల్లో 'శాంతి', 'సుపరిపాలన' ఉండాలని కోరుకున్నారు. వాళ్ళ వెనక నూటయాభై ఏళ్ళుగా రక్తంలో తడిసిన గిరిజన ప్రాంతాల జ్ఞాపకాలున్నాయి. 'శాంతి', 'సుపరిపాలన' అనే మాటలు వాడటంలో రాజ్యాంగ రూపకర్తలు ఎంతో వివేకాన్నీ, దూరదృష్టినీ కనపరిచారు.

దిశానిర్దేశం

గ్రామీణ ఉపాధ్యాయుడు ఒక నిష్ఠుర, ఏకాంత ప్రపంచంలో కూరుకుపోయి తననొక అభిశప్తుడిగా భావించుకుంటూ ఉన్నాడు. అతణ్ణి సమీపించి, అతడు చేస్తున్న పని చూసి, అతడి భుజం తట్టడానికి ప్రభుత్వానికి సమయం లేదు. ప్రభుత్వానికి లెక్కలు కావాలి. అంకెలు కావాలి. కాని, పాఠశాలలకి ఉత్సాహం కావాలి, ఉత్తేజం కావాలి. అదివ్వగలిగినవాళ్ళు ఎవరు? ఎక్కడున్నారు?

కళాప్రారంభవేళ

మానవదేహాలు, ముఖాలు, కళ్ళు మటుకే కాదు, వీథుల్లో, రెస్టరెంట్లలో, రైళ్ళల్లో, ఆఫీసుల్లో, నిర్మాణస్థలాల్లో ప్రతి ఒక్కచోటా పోగుపడే మనుషులే అతడి కావ్యవస్తువు. ఆ మనుషులు ఏకకాలంలో నిర్దిష్టవ్యక్తులుగానూ, స్థలాతీత, కాలాతీత వ్యక్తులుగానూ కూడా కనిపిస్తున్నారు.