అందుకని, మొదటగా, తెలుగు సాహిత్యం మీద ఇప్పటిదాకా రాసిన వ్యాసాల్ని పుస్తకరూపంలో అందివ్వాలని అనుకున్నాను. వాటితో పాటు, ఈ మధ్యకాలంలో రాసిన కొన్ని సమీక్షలూ, ముందుమాటలూ కూడా కలిపి 125 వ్యాసాలతో 'దశార్ణ దేశపు హంసలు' పేరిట ఇలా పుస్తకరూపంలో అందిస్తున్నాను.
కరుణరసాత్మక కావ్యం
ఆ పుస్తకం ఒక కరుణరసాత్మక కావ్యం అన్నాడు కవితాప్రసాద్ నా 'కొన్ని కలలు కొన్ని మెలకువలు చదివి. అది విద్యా సంబంధమైన గ్రంథమనో, గిరిజన సంక్షేమానికి సంబంధించినదనో అనకుండా దాన్నొక కావ్యమనీ అది కూడా కరుణరసాత్మకమనీ అనడం నా హృదయాన్ని చాలా లోతుగా తాకింది.
జీవనం సత్యం జీవనం సుందరం
అసలు, ఒక నవల గురించి ఇంత స్వల్పకాలంలో ఇన్ని పరిచయవ్యాసాలు తెలుగులో ఇప్పటిదాకా ఏ నవల గురించీ రాలేదంటే అతిశయోక్తి కాదేమో. కేవలం ప్రింటు మీడియంలో ఇదెన్నటికీ ఊహించలేని విషయం.