ఆ తెలివెలుగులో దూరంగా చిన్న చిన్న కొండలు, మంచుముసుగు ఇంకా తొలగించని అవతలి వడ్డు, రేవులో లంగరు వేసుకుని నిద్రపోతున్న క్రూయిజులు-వీటిమధ్య బ్రహ్మపుత్ర ఒక నీలిరేఖలాగా గోచరించింది. సూర్యుడు ఉదయించినతర్వాత, ఆ నీటిపాయలు ఇసుకతిన్నెలమీద ఆరబెట్టిన చీనాంబరాల్లాగా కనిపించడం మొదలుపెట్టాయి.
కామరూప-1
ఈశాన్య భారతసంగీతమంటే నాకు తెలిసినపేర్లు ఎస్.డి.బర్మన్, భూపేన్ హజారికాలు మాత్రమే. కాని, ఆ మూజిక్ షాపులో కొందరు అద్భుతమైన గాయనీ గాయకుల పేర్లు మొదటిసారిగా విన్నాను.
నా చంపారన్ యాత్ర-5
బుద్ధుడు నడయాడిన ప్రతి చోటూ మనకేదో చెప్తూనే ఉంటుంది. ఈసారి నాకు అర్థమయింది, బుద్ధుడికీ, వైశాలికీ మధ్య ఉన్న అనుబంధం లాంటిదే మళ్ళా గాంధీజీకి చంపారన్ కీ మధ్య ఏర్పడిందని.