ఇన్నాళ్ళకు కోసక్కులు చదివేక నాకు అర్థమయిందేమంటే, తనలోని ఈ విముక్తి అవసరాన్ని ఆయన కాకసస్ లోని తొలిరోజుల్లోనే గుర్తుపట్టాడని. పూర్వరచయితల్లాగా ఆ ప్రకృతిని ఒక సుందరసీమగా మాత్రమే ఆయన చూడలేకపోయాడు. అక్కడ స్వతంత్రంగా జీవించే మనుషులున్నారనీ, నువ్వు నిజంగా ఆ సీమని ప్రేమిస్తే, నువ్వు చెయ్యవలసింది ముందు వాళ్ళల్లో ఒకడివి కావడమేననీ ఆయన గుర్తుపట్టాడు.
దిగులు కలిగినదేలనొ
తోట లోపల వింటి నేనొక మధుర మంజుల మంత్రగానము తీపి తలపులు మదిని నిండగ దిగులు కలిగినదేలనొ
ప్రేమగోష్ఠి-14
అంటే ఒక సౌందర్య శిఖరారోహణ అన్నమాట. అందులో అత్యున్నత శిఖరానికి చేరుకున్న ఆ సత్యాన్వేషి ఋషిగా మారి ఆ సోపానమార్గంలో కిందకి దిగి తన తోటిమనుషులకు తిరిగి ఆ దారిగురించి బోధిస్తాడని మనకి సింపోజియం చెప్పకనే చెప్తుంది. మనుషుల పట్ల ప్రేమలేకపోతే ఆ ఋషి తిరిగి మళ్ళా ఈ సాధారణ జీవితంలో అడుగుపెట్టవలసిన పనే లేదు.