అందులో అనుభూతికన్నా, అభిప్రాయప్రకటనకన్నా, పదచిత్రాలకన్నా భిన్నమైందేదో కనిపించింది. ఎంత ప్రయత్నించీ అదేమిటో బోధపరుచుకోలేకపోయాను. ఆ కవితను ఈ నలభయ్యేళ్ళలో వందసార్లేనా చదివి ఉంటాను. కాని ఎప్పటికప్పుడు అది నాకు అందుతూనే అందకుండా జారిపోయేది.
కవిత్వంలో మంత్రశక్తి
ఒక శిల్పం చూడండి. అది మనతో మాట్లాడుతుంది, కాని భాషతో పనిలేదు దానికి. తన పాదార్థిక అస్తిత్వం వల్లనే అది శిల్పంగా నిలబడుతున్నది కానీ, ఆ పదార్థం ఒక వాహకం మాత్రమే. మనతో మాట్లాడేది ఆ పదార్థం కాదు. అలా ఒక శిల్పంలాగా మనతో మాట్లాడగల కవితని ఊహించండి. అటువంటి కవిత్వం తెలుగులో దాదాపుగా అరుదు.
జయగీతాలు-3
ప్రభువు మాట్లాడే మాటలు అత్యంత నిర్మలమైనవి. ఏడు సార్లు కాల్చి పుటం పెట్టిన పరిశుద్ధమైన వెండి లాంటివి.