భీముడి ఆత్మకథ

'మహాభారతంలో మనుషులు ఎదుర్కొన్న కొన్ని సంక్షోభాలే' తన నవలకి ఇతివృత్తమని నాయర్ చెప్పుకున్నాడు. అంత విస్తారమైన గ్రంథంలో కూడా కృష్ణద్వైపాయన వ్యాసుడు మౌనం వహించిన కొన్ని తావుల్ని తాను పట్టుకున్నాననీ, ఆ తావుల్ని తనకు విడిచిపెట్టినందుకు వ్యాసుడికి ప్రణమిల్లుతున్నాననీ కూడా రాసుకున్నాడు.

మధురవిషాద మోహగాథ

నా దృష్టిలో విక్రమోర్వశీయం కావ్యం. అందమైన, సుకుమారమైన దీర్ఘకవిత. చింగిజ్ ఐత్ మాతొవ్ రాసిన జమీల్యా లాగా అది విషాదమాధుర్యాలు కలగలిసి, చివరికి, మాధుర్యమే మనల్ని వెన్నాడే ఒక మోహగాథ.

కొత్తగా, సరి కొత్తగా

భగవంతుడు తన జీవితంలో కొత్తగా, సరికొత్తగా అడుగుపెట్టినట్టే, టాగోర్ కూడా అడుగుపెడుతున్నాడు, నా జీవితంలో, ఎప్పటికప్పుడు కొత్తగా, సరికొత్తగా.