తెలుగులో పద్య సంకలనాలు ఉన్నట్లుగా గద్య సంకలనాలు చాలా తక్కువ. తెలుగు కవిత్వాన్ని 'కావ్యమాల' (1959) పేరిట సాహిత్య అకాదెమీ కోసం కాటూరి వెంకటేశ్వర రావుగారు ఒక సంకలనం తీసుకొచ్చారు. అయితే అందులో కవుల ఎంపిక, పద్యాల ఎంపిక మొత్తం మల్లంపల్లి శరభయ్యగారే చేసారు.
ఆయన వెంట నడుస్తూనే ఉన్నాను
దురదృష్టవశాత్తూ మనం సాధన చేస్తున్నది రాజీపడకుండా మన అభిప్రాయాల్ని నిలబెట్టుకోవడమెలా అన్నది. కాని నిజంగా కావలసింది, రాజీ పడినా సరే, ప్రేమించడమెట్లా అన్నది. చలంగారు జీవితకాలం చేసింది అదే.
ఎర్రాప్రగడ
ఇప్పుడు ఏ మిగలముగ్గిన తాటిపండుని చూసినా ఎర్రాప్రగడ గుర్తుకు వస్తాడు. ఎర్రన రాసిన ఏ పద్యం చదివినా చెట్టుమీదే పండి చుట్టూ గాలిని సురభీకరించే తాటిపళ్ళు గుర్తొస్తాయి.