పునర్యానం -17

ఆ తర్వాత మూడేళ్ళ పాటు నా రాజమండ్రి జీవితాన్ని ఆ పుస్తకం వెలిగించింది. ఒక మనిషికి ఒక పుస్తకం తోడుగా ఉండటమనేది సాధారణంగా మనం మతగ్రంథాల విషయంలోనే చూస్తాం. కాని అరుదుగా సాహిత్య గ్రంథాలు కూడా అటువంటి చోటు సంపాదించుకోగలవని ఆగమగీతి నా జీవితంలో ప్రవేశించాకే అర్థమయింది.

పునర్యానం-2

పునర్యానం కావ్యాన్ని నిర్మించడానికి నాకు తైత్తిరీయ ఉపనిషత్తు దారి చూపించింది. అందులో వివరించిన పంచకోశ జాగృతి వెలుగులో నా జీవితానుభవాన్ని పరిశీలించుకున్నాను.

ఆషాఢమేఘం-14

ఒక విమర్శకుడు రాసినట్టుగా, 473 మంది సంగం కవులున్నారంటే, 384 మంది గాహాకోశ కవులున్నారంటే, ఆ కాలాలు, ఆ సమాజాలు ఎంత రసనిష్యందితాలయి ఉండాలి!