ఒక మనిషి జీవిత సార్థక్యాన్ని జీవితకాల కృషి ఋజువు చేస్తుంది నిజమే, కాని మనీషుల విషయంలో జీవితంతో పాటు మృత్యువు కూడా ఆ సార్థక్యాన్ని రుజువు చేస్తుందనుకుంటే కలాం చివరి క్షణాలు అందుకు నిర్దుష్ట తార్కాణం.
చక్రాల వెంకట సుబ్బుమహేశ్వర్
మా మిత్రుడూ, నాకెంతో ఆత్మీయుడూ మహేష్ నిన్న రాత్రి చెన్నైలో ఈ లోకం వదిలిపెట్టివెళ్ళిపోయాడు. నిన్నసాయంకాలమే సురేష్ బాబు ఫోన్ చేసినప్పుడే నేనీ వార్త వినడానికి మానసికంగా సిద్ధపడిపోయాను. పొద్దున్నే కుప్పిలి పద్మ, కొప్పర్తి, వొమ్మి రమేష్.. రాజమండ్రి మిత్రులంతా ఫోన్ చేస్తూ ఉన్నారు.