మాలతీచందూర్

నన్ను చాలా ప్రభావితం చేసిన రచయితల్లో మాలతీచందూర్ గారిని చెప్పుకోవాలి. ఆమె నన్ను మాత్రమే కాదు, కొన్ని తరాల్ని ప్రభావితం చేసిన రచయిత.ఆమె సాహిత్యజీవితం, పౌరజీవితం సారాంశమంతా ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగుసమాజాన్ని మారుతున్న పరిస్థితులకి అనుగుణంగా సమాయత్తం చెయ్యడమేనని చెప్పవచ్చు.

హీరాలాల్ మాష్టారు

నిన్న తెల్లవారు జాము నిద్రలో ఎందుకో ఫోన్ తడిమిచూసుకుంటే మెసేజి, విద్యారణ్య కామ్లేకర్ నుంచి, ఏ అర్థరాత్రి ఇచ్చాడో: 'భద్రుడూ, నాన్నగారు ఇక లేరు. 'అని. అది చూసినప్పటినుంచీ, నాలో ఒక పార్శ్వం చచ్చుబడిపోయినట్టే ఉంది.

ఒక పద్యసముద్రం ఇంకిపోయింది

ఆ పార్థివ శరీరం అగ్నికి ఆహుతైపోయింది. చుట్టూ చిగురిస్తున్నకానుగ చెట్లు, వేపచెట్లు.. కవితావసంతుడు వసంతఋతువులో కలిసిపోయాడు. నిబ్బరంగా నిల్చుందామనే అనుకున్నాను, కాని ఎక్కణ్ణుంచి వచ్చాయి అన్ని కన్నీళ్ళు.