ఒక విపత్తు, కుటుంబాలకు గానీ, సమాజాలకు గానీ, సంభవించాక, అది నేర్పే పాఠాలు మన జాతిస్మృతిలో, సమాజస్మృతిలో భాగం కావాలి. అంటే విపత్తు విద్యగా మారాలి. ఆ పాఠాలు ఎంత క్రూరంగానైనా ఉండనివ్వు. కాని ఆ అనుభవాలు పాఠాలుగా మారకపోతే, మళ్ళా అలాంటి పరిస్థితులే సంభవించినప్పుడు, మనుషులు మళ్ళా అంతే క్రూరంగా ప్రవర్తిస్తారు.
2,47,000 ఏళ్ళ నాటి మాట
ఇదంతా నాకైతే నాకు కొత్త ప్రపంచంగా అనిపించింది. కాని అది మనమధ్యనే మరుగున పడి ఉన్న ప్రపంచం. తెలుగువాళ్ళు గర్వించవలసిన నిజమైన సందర్భాలంటూ ఉంటే అవి ఇలాంటి ఆవిష్కరణలు వెలుగు చూసిన సందర్భాలు.
వ్యవస్థా వికాసం కూడా అత్యవసరం
శ్రమలో పరాయీకరణ వల్ల, ప్రభుత్వాల ఆధిపత్య ధోరణి వల్ల మాత్రమే కాదు, అసలు ప్రాయికంగా, మనుషులు తమ పనినీ, తమ కార్యక్షేత్రాన్నీ గౌరవించుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంటున్నదని నా అభిప్రాయం.