ఇన్నేళ్ళ నా అభిప్రాయాన్ని పరాస్తం చేసేసారు సుష్మ. కబీర్ దోహాలకి నా వచన అనువాదాల్ని ఆమె ట్యూన్ చేసి నాకు పంపించినప్పుడు నన్ను సంభ్రమం ముంచెత్తింది. ఎలా అయితే, అనువాదాన్ని దాటి కూడా కవిత్వం ప్రవహించగలదో, అనువాదాన్ని దాటి సంగీతం కూడా ప్రవహించగలదని ఇప్పుడు నాకు అర్థమయింది.
ప్రకృతి తపస్వి
తాను చూస్తున్న దృశ్యానికి ఎటువంటి వ్యాఖ్యానాన్నీ జతపరచకుండా చూసింది చూసినట్టుగా చెప్పాలనే ఆ చిత్రకారుడి నిజాయితీ వల్ల మాత్రమే, ఆ కాలం గడిచిపోయినా, ఆ రష్యా రూపురేఖలు మారిపోయినా, ఆ సౌందర్యం మాత్రం శాశ్వతంగా నిలిచిపోయింది.
వర్షం కురిసిన మైదానాల్లో
నా ఇరవై ఏళ్లప్పుడు నా ‘శరణార్థి’ కథను రాజమండ్రిలో, శరభయ్య గారు ఇలానే చదివి, ఒక్కొక్క వాక్యాన్నే ఎత్తిచూపుతో, ఇట్లానే తన స్పందన పంచుకున్నారు. ఈసారి నా చిత్రలేఖనాలకు అటువంటి స్పందన లభించింది.