జుగల్ బందీ

వారిద్దరూ ముస్లిములు. ఒకరిది బెంగాల్, మరొకరిది వారణాసి. ఆలపించిందేమో ఒక గుజరాతీ హిందూ కవి రాసిన కృష్ణలీలా కీర్తన. ఆ వీడియో క్లిప్ కింద ఉన్న వందలాది కామెంట్లలో ఒకరు రాసారు కదా: 'ఇద్దరు హిందువులు చేసిన అద్భుతమైన జుగల్ బందీ అది ' అని. కాని వాళ్ళిద్దరూ హిందువులూ కారు, ముస్లిములూ కారు. భారతీయులు.

తన చేతికర్రనే జతకత్తె

ఇక ప్రసంగం విన్న తరువాత కూడా నన్ను వదలని గీతాలు రెండు: ఒకటి, డొగీ మెక్ లీన్ ఆలపించిన స్కాటిష్ గీతం, మరొకటి సుబ్బులక్ష్మి దర్బారీ రాగంలో ఆలపించిన 'హరీ తుమ్ హరో జన్ కీ పీర్..'

ఒక్క రాముడు తప్ప

ఆ గీతాన్ని ఆ గాయకుడూ, అతడి శిష్యురాలూ ఆలపిస్తున్నంతసేపూ అక్కడొక సుగంధం ఊరుతున్నట్టే ఉంది. అది నిజంగానే ఒక అర్థరాత్రి సంభాషణ. ధన్య ప్రసంగం. పండిట్ జస్ రాజ్ కుమార్తె దుర్గా జస్ రాజ్ అభివర్ణించినట్టుగా, అది దివ్య దర్శనం.