న్యూ బాంబే టైలర్స్

ఖదీర్ బాబు 'దర్గామిట్ట కథలు' లో కనవచ్చే ఒక నైతిక పార్శ్వం ఈ నాటకంలో కూడా ఉంది. అదే ఈ నాటకాన్ని విషాదాంతం కాకుండా చేసింది. మనిషి ఒక పనిముట్టుగా, ఒక కూలీనంబరుగా మారిపోకుండా నిలబడాలని చెప్పే ఈ కథ ఈ నాటకాన్ని ఆశావహంగా ముగించింది.

హిందువులూ, ముస్లిములూ కాదు, మనుషుల కథలు

రూపకం నడుస్తున్నంతసేపూ మనం మనలోకి చూపుసారిస్తాం. మనల్ని మనం ఎన్నో ప్రశ్నలు వేసుకుంటాం, ఏవో జవాబులు చెప్పుకోడానికి ప్రయత్నిస్తాం. కానీ ఏ ఒక్క జవాబూ తృప్తి కలిగించదు. మనలో ఈ కలవరం కలిగించడమే నాటక బృందం ఉద్దేశ్యమయితే వారు అనుకున్నది సాధించారనే చెప్పాలి.

పాకుడు రాళ్ళు

పాతికేళ్ళుగా ఎదురుచూస్తున్నాను ఇట్లాంటి రోజు కోసం. ఒక నాటకం కోసం ప్రేక్షకులు ఇలా విరగబడే రోజు కోసం.