సౌందర్య సృష్టికర్త

అలా చూసినప్పుడు ట్రెవర్ ఛాంబర్లేను తన తరానికీ, తన తర్వాతి తరాలకీ కూడా సంతోషాన్నివ్వగల కొన్ని సౌందర్యశకలాల్ని సృష్టిస్తూ వచ్చాడని అర్థమవుతుంది. అతడు చిత్రించిన ప్రతి కాన్వాసులోనూ, ప్రతి కాగితం మీదా కాంతిని అద్దుకుంటూ పోయేడు. ఆ బొమ్మల్ని ఎవరు చూసినా అన్నిటికన్నా ముందు వాళ్ళు ఆ కాంతి తమమీద వర్షిస్తున్న అనుభూతికి లోనవుతారు.

ఒక విముక్తక్షణం

మనిషి స్వాతంత్య్రానికి అన్నిటికన్నా పెద్ద శత్రువు పిరికితనం అని చెప్పగలనుగాని, తీరా దాన్ని వదుల్చుకుందాం అనుకునేటప్పటికి అది ఎన్ని సూక్ష్మరూపాల్లో మనల్ని అంటిపెట్టుకుని ఉంటుందో బొమ్మలు వెయ్యడానికి కూచుంటే తప్ప తెలియదు.

అదంతా ఒక అదృశ్యయుగం

ఇప్పుడు నెమ్మదిగా కనుమరుగవుతున్న మండువా పెంకుటిళ్ళు. ఆ గోడల మీద ఆ చిత్రాల్ని చూస్తున్నప్పుడు మనం నలభై యాభై ఏళ్ళు వెనక్కిపోతాం. అది గతించిన కాలం. సమష్టికుటుంబాల కాలం. మనుషులూ, మనసులూ దగ్గరగా బతికిన కాలం. ఇంకా చెప్పాలంటే అదంతా ఒక అదృశ్యయుగం.

Exit mobile version
%%footer%%