ఔత్సాహిక వాణిజ్యవేత్తలుగా జీవితంలో రాణించాలనుకుని కఠినమైన తోవ తొక్కిన 25 మంది కథ ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజిమెంట్, అహమ్మదాబాద్ లో చదివిన 25 మంది జీవితానుభవాల సారాంశం. వయసుల్లో, దృక్పథాల్లో, తామెంచుకున్న రంగాల్లో ఒకరికీ, మరొకరికీ పోలిక లేనే లేదు. కానీ, వాళ్ళందరిలో ఉమ్మడిగా కనిపించేదొకటే. వాళ్ళు కలలుగన్నారు, ఆ కలల్ని నమ్మారు. వ్యాపార నిర్వహణలో విద్యాభ్యాసం పూర్తిచేసుకున్న యువపట్టభద్రులు సౌకర్యవంతమైన జీతాలకన్నా, ఉద్యోగాల కన్నా మించినదాన్ని చూడటానికి ఈ పుస్తకం ప్రోత్సహిస్తుంది. వారిని కలలు కనమనీ, ఆ కలల్ని నిజం చేసుకోమనీ వెన్నుతడుతుంది.
రశ్మి బంసల్ రచించిన ఈ పుస్తకాన్ని రీమ్ పబ్లికేషన్స్ కోసం వాడ్రేవు చినవీరభద్రుడు 2010 లో అనువాదం చేసారు.
ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభ్యమవుతున్నది.