మహాత్మాగాంధీ 1948 ఫిబ్రవరిలో దేశ భవితవ్యం గురించి చర్చించడానికి వార్ధాలో ఒక సమావేశాన్ని సంకల్పించారు. కాని, జనవరిలో ఆయన హత్యకు గురవడంతో, ఆ సమావేశం డా.రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన ఏప్రిల్ లో జరిగింది. ఆ సమావేశంలో దేశం అప్పుడు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల మీదనే కాక, దేశ భవిష్యత్తు తీరుతెన్నుల గురించి కూడా విస్తృతంగా చర్చ జరిగింది. నెహ్రూ, వినోబా తదితరులు పాల్గొన్న ఆ సమావేశాల సారాంశాన్ని గోపాల కృష్ణ గాంధి Gandhi is Gone: Who will Guide Us పేరిట వెలువరించారు.
ఉత్కంఠభరితమైన రూపకంలాగా నడిచిన ఆ సంభాషణలను ఎమెస్కో సంస్థ వారి ‘పొరుగునుంచి తెలుగులోకి’ శీర్షిక కింద వాడ్రేవు చినవీరభద్రుడు అనువదించడమే కాక, సమగ్రమైన సమీక్షా వ్యాసం కూడా పొందుపరిచారు.
ఈ పుస్తకం అన్ని విక్రయకేంద్రాల్లోనూ లభిస్తున్నది.